రకుల్ ఉదారత... లాక్ డౌన్ ముగిసేంతవరకూ 250 కుటుంబాలకు 2 పూటలా భోజనం!
- రకుల్ ఇంటికి దగ్గర్లో మురికివాడ
- నిత్యమూ ఆహారం పంపుతున్న హీరోయిన్
- నెలాఖరు వరకూ అందిస్తానని వెల్లడి
లాక్ డౌన్ ను పొడిగిస్తే, ఈ సదుపాయాన్ని మరిన్ని రోజులు అందిస్తామని, ప్రస్తుతానికి ఈ నెలాఖరు వరకూ ఆహారం అందిస్తామని స్పష్టం చేసింది. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్న వేళ, ప్రతి ఒక్కరూ సాయం చేయాలని సూచించింది. చాలా మందికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు ఉందని, అది వారి అదృష్టమనే చెప్పాలని వ్యాఖ్యానించిన రకుల్, పేదలు తృప్తిగా భోజనం చేస్తుంటే, వారి ముఖంలో కనిపించే చిరునవ్వు తనకు సంతోషాన్ని ఇస్తుందని, అందుకోసం తనవంతుగా చిన్న సాయం చేస్తున్నానని రకుల్ చెప్పుకొచ్చింది.