నిమ్స్ లో ఇక కరోనా రోగులకు ప్రవేశం లేదు: సాధారణ రోగులకు మాత్రమేనన్న తెలంగాణ ప్రభుత్వం
- నాన్ కొవిడ్ ఆసుపత్రిగా నిమ్స్
- పేద రోగులకు సేవలను అందించేందుకే
- జీవోను విడుదల చేసిన ప్రభుత్వం
నిమ్స్ లో ఇకపై ఓపీ సేవలు ప్రారంభమవుతాయని, రోజుకు 2,500 మందిని వైద్యులు పరిశీలిస్తారని, ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం గాంధీ ఆసుపత్రికి తరలిస్తారని అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచి ఆసుపత్రిలో ఓపీ సేవలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నిమ్స్ లోని బయాలజీ విభాగంలో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.