దేశంలో కరోనా వ్యాప్తిపై రాశీ ఖన్నా ఆసక్తికర పోస్టు
- కరోనాను లౌకికవాద వైరస్ గా పేర్కొన్న రాశీ ఖన్నా
- దానికి మతం, కులం తెలియవని వ్యాఖ్యలు
- కరోనా వ్యాప్తికి ఇతరులను నిందించడం మానేద్దామని హితవు
"కొవిడ్-19 పూర్తిగా లౌకికవాద వైరస్. మతాల ఆధారంగా అది ప్రజలపై వివక్ష ప్రదర్శించదు. అందరిపట్ల సమభావం ప్రదర్శిస్తుంది. తనను తాకిన ప్రతివాళ్లను బాధించడమో, చంపడమో చేస్తుంది. ఈ క్రమంలో వర్గం, కులం, సంపద, మతం అనే అంశాలను ఏమాత్రం పట్టించుకోదు. ఇప్పటికైనా కరోనా వ్యాప్తికి ఒకరిని నిందించడం మానేద్దాం. కరోనాపై కలసికట్టుగా పోరాడుదాం" అంటూ రాశీ పిలుపునిచ్చారు.