కరోనాపై పోరులో భారీ విరాళంతో ముందుకొచ్చిన బిర్లా గ్రూప్
- కరోనా కట్టడికి రూ.500 కోట్లు
- రూ.400 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం
- సహాయక చర్యలు, మాస్కులు, వెంటిలేటర్ల కోసం రూ.100 కోట్లు
అంతేకాకుండా, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా 10 లక్షల మాస్కులను సిద్ధం చేస్తున్నామని పేర్కొంది. ముంబయిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ముంబయి మున్సిపాలిటీ సహకారంతో 100 పడకలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో 200 పడకలు ఏర్పాటు చేస్తున్నామని ఆ ప్రకటలో బిర్లా వర్గాలు వివరించాయి.