వైద్యులపై కరోనా రోగుల దాడి ఎఫెక్ట్.. ‘గాంధీ’ వద్ద భారీ బందోబస్తు
- గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి
- తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం
- 200 మంది పోలీసులతో గట్టి భద్రత
వైద్యులపై మరోమారు దాడులు జరగకుండా ఆసుపత్రి వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఐసోలేషన్ వార్డులున్న 5 నుంచి 8 అంతస్తుల మధ్య గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇద్దరు అదనపు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 27 మంది ఎస్ఐలు సహా మొత్తం 200 మందిని గాంధీ ఆసుపత్రి వద్ద మోహరించారు.