Corona Virus: కరోనా వైరస్ ఆచూకీ పట్టేసే కాగితం.. రూపొందించిన బ్రిటన్ యూనివర్సిటీ!

  • క్రాన్ ఫీల్డ్ వర్సిటీ పరిశోధకులు వినూత్న ఆవిష్కరణ
  • రసాయనాలు పూసిన కాగితంతో కరోనా టెస్టు
  • ప్రస్తుతానికి ప్రయోగశాలకే పరిమితమైన ప్రత్యేక కాగితం
Scientists Are Developing a Test to Find The New Coronavirus in Wastewater

ఓవైపు కరోనా మహమ్మారి తన పని తాను చేసుకుంటూ పోతుంటే, మరోవైపు పరిశోధకులు వైరస్ గుట్టు కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో బ్రిటన్ లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం ఆసక్తికర పరిశోధన చేసింది. వ్యర్థ జలాల్లో కరోనా వైరస్ ఆచూకీని గుర్తించే ప్రత్యేకమైన కాగితాన్ని రూపొందించింది.

ఈ కాగితానికి కొన్ని రసాయనాలు పూస్తారు. ఈ కాగితంపై మురికి నీటిని పోస్తే అందులోని పలు పొరలు వ్యాధికారక క్రిముల న్యూక్లియిక్ యాసిడ్లను వడపోస్తాయి. ఒకవేళ ఆ నీటిలో కరోనా వైరస్ ఉంటే ఆ కాగితంపై ఆకుపచ్చని వలయం ఏర్పడుతుంది. కరోనా లేకపోతే నీలి రంగు వలయం కనిపిస్తుంది. మానవుల నుంచి విసర్జితాల ద్వారా బాహ్యప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా కరోనా వైరస్ రోజుల తరబడి సజీవంగా ఉంటోందన్న విషయం ఈ పరిశోధన ద్వారా గుర్తించారు.  కాలనీల నుండి వచ్చే డ్రైనేజీ కాలువలలోని మురికి నీటిని పరీక్షించడం ద్వారా ఆ కాలనీలో ఎవరికైనా వ్యాధి ఉందా? అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవడానికి ఈ విధానం ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

కాగా, ఈ ప్రత్యేక కాగితం తయారీకి అయ్యే ఖర్చు రూ.100 కన్నా తక్కువేనట. ఈ కాగితాన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చని, పరీక్ష పూర్తయిన తర్వాత కాగితాన్ని కాల్చి వేయాల్సి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతానికి ఇది ప్రయోగశాల వరకే పరిమితమైంది. జనబాహుళ్యంలోకి తీసుకువచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని ఝుగెన్ యాంగ్ అనే బయోమెడికల్ ఇంజనీర్ తెలిపారు.

  • Loading...

More Telugu News