రామ్ హీరోగా మారుతి సినిమా
- కిషోర్ తిరుమలతో మూడో సినిమా
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ
- త్వరలోనే పూజా కార్యక్రమాలు
ఈ సారి కూడా రామ్ మాస్ ఎంటర్టైనర్ సినిమానే చేస్తున్నాడనే టాక్ వినిపించింది. కానీ అందులో నిజం లేదట. వరుసగా అదే జోనర్ సినిమాలు వద్దని రామ్ చెప్పడంతో, ఆయన కోసం మారుతి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశాడట. ఇటీవల మారుతి రూపొందించిన 'ప్రతిరోజూ పండగే' తరహాలో, ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ సాగుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలకి ముహూర్తాన్ని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.