సాయం చేయండంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విజయ్ మాల్యా
- లాక్ డౌన్ కారణంగా నా కంపెనీల కార్యకలాపాలు ఆగిపోయాయి
- ఉద్యోగులను ఇంటికి పంపలేకపోతున్నాం
- తగిన వేతనాలను కూడా చెల్లించలేకపోతున్నాం
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లిస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ఆఫర్ చేశానని... తన నుంచి డబ్బు తీసుకోవడానికి బ్యాంకులు ముందుకు రాలేదని... ఇదే సమయంలో అటాచ్ చేసిన తన ఆస్తులను రిలీజ్ చేయడానికి ఈడీ కూడా ముందుకు రాలేదని విజయ్ మాల్యా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో తన మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి వింటారని ఆశిస్తున్నానని చెప్పారు.