Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారికి మరొకరి బలి

  • రాష్ట్రంలో రెండుకు చేరిన మరణాలు
  • పాజిటివ్ కేసుల సంఖ్య 76
  • ఇవాళ కొత్తగా 6 కేసుల నమోదు
Another corona death in Telangana state as dearth toll reaches two

తెలంగాణలో కరోనా వైరస్ మరొకరిని బలి తీసుకుంది. ఇవాళ కొత్తగా 6 కేసులు నమోదు కాగా, ఓ మరణం చోటుచేసుకుంది. దాంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 2కి చేరింది. మూడ్రోజుల కిందట తెలంగాణలో తొలి కరోనా మరణం సంభవించగా, ఆ విషయం నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 76 అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కరోనా పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన 13 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని బులెటిన్ లో తెలిపారు.

More Telugu News