Virat Kohli: మా వంతుగా మేం సాయం చేస్తున్నాం: విరుష్క

  • పీఎం-కేర్ ఫండ్ ను ప్రారంభించిన ప్రధాని
  • మా సాయం కొంతవరకైనా ఉపయోగపడుతుంది
  • ట్విట్టర్ లో వెల్లడించిన విరాట్ కోహ్లీ
Virushka Contributes to PM Cares Fund

కరోనాపై పోరాడేందుకు అవసరమైన నిధుల కోసం ప్రధాని పీఎం-కేర్స్ ఫండ్ ను ప్రారంభించి, విరాళాలను కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించగా, తాజాగా ఈ జాబితాలోకి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య, సినీనటి అనుష్క శర్మ చేరిపోయారు. పీఎం-కేర్స్ ఫండ్‌ కు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు.

"నేను, అనుష్క పీఎం-కేర్స్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయనిధి (మహారాష్ట్ర)కి మద్దతు ఇస్తామని హామీ ఇస్తున్నాము. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది పడుతున్న బాధను చూసి మా హృదయాలు చలించిపోయాయి. ఈ మా సహాయం బాధలో ఉన్న వారికి కొంతవరకైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను" అని విరాట్ ట్వీట్ చేయగా, ఇదే ట్వీట్ ను అనుష్క కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

More Telugu News