ఆ 15 లక్షల మందిపై నిఘా.. వారు నివసిస్తున్న ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించే యోచన!
- 15 జనవరి నుంచి 23 మార్చి మధ్య దేశానికి 15 లక్షల మంది రాక
- వీరందరినీ క్వారంటైన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశం
- వారి నివాస ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించాలన్న కేంద్రం
పైన పేర్కొన్న కాలంలో విదేశాల నుంచి 15 లక్షల మంది స్వదేశానికి చేరుకున్నట్టు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సమాచారం అందించిందని, ఈ నేపథ్యంలోనే వీరిపై నిఘా పెట్టాలంటూ రాష్ట్రాలను ఆదేశించినట్టు కేబినెట్ కార్యదర్శి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన కొందరికి మాత్రమే పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్న కేంద్రం.. వారు నివసిస్తున్న ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించాలని సూచించింది. అలాగే, వారందరూ ఐసోలేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.