వలస కార్మికులకు అండగా నిలవాలన్న సీఎం రమేశ్... వెంటనే స్పందించిన కేటీఆర్
- సంగారెడ్డిలో చిక్కుకుపోయిన బీహార్, ఝార్ఖండ్ కార్మికులు
- సీఎం రమేశ్ దృష్టికి తెచ్చిన ఎంపీ నిషికాంత్ దూబే
- సాయం చేయాలంటూ కేటీఆర్ ను కోరిన సీఎం రమేశ్
దాంతో తాను కార్మికులను పరామర్శించానని, వారి యాజమాన్యంతో మాట్లాడానని తెలిపారు. ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా తెలంగాణ సీఎంవోను, మంత్రి కేటీఆర్ ను కోరుతున్నానని, వలస కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ లో బదులిచ్చారు. 'కార్మికులకు తప్పకుండా అండగా నిలుస్తాం ఎంపీ గారూ' అంటూ ట్వీట్ చేశారు. తన కార్యాలయంతో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా దీనిపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.