India: ఒక్కరోజులో ముగ్గురి మృతి... భారత్ లో తీవ్రమవుతున్న కరోనా

  • దేశంలో ఏడుకు చేరిన కరోనా మరణాలు
  • బీహార్ కు చెంది 38 ఏళ్ల వ్యక్తి మృతి
  • దేశంలో కరోనా మృతుల్లో ఇతడే పిన్నవయస్కుడు
Three people died in India due to corona

చైనాను దాటి ప్రపంచదేశాలపై పంజా విసురుతున్న కరోనా భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇవాళ ఒక్కరోజులోనే ముగ్గురు మృతి చెందడం ఈ మహమ్మారి వ్యాపిస్తున్న తీరుకు నిదర్శనం. తాజా మరణాలతో భారత్ లో ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఏడుకి చేరింది. బీహార్ కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి కూడా మృతుల్లో ఉన్నాడు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో చనిపోయిన వారిలో ఈ బీహార్ వ్యక్తి పిన్నవయస్కుడు. అతడు పాట్నాలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇవాళ మరణించిన మిగతా ఇద్దరిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు గుజరాత్ కు చెందిన వ్యక్తి.

More Telugu News