ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. రోడ్లన్నీ ఖాళీ!
- జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటిస్తున్న ప్రజలు
- అత్యవసర సేవలు మినహా అన్నీ మూత
- ఏపీలో పెట్రోలు బంకులు కూడా మూత
అయితే, అత్యవసర సేవలైన వైద్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖ, ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలు బంకులు, మీడియా సిబ్బందికి మాత్రం జనతా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఏపీలో అయితే పెట్రోలు బంకులు కూడా మూసివేశారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది. జనతా కర్ఫ్యూను దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటిస్తూ ఇళ్లలోనే ఉండడంతో దేశం మొత్తం పిన్డ్రాప్ సైలెన్స్గా మారిపోయింది.