పూర్తి నిర్బంధంలోకి రాజస్థాన్.. తొలి రాష్ట్రంగా రికార్డు
- ఈ నెల 31 వరకు షట్డౌన్
- ప్రజలు సహకరించాలని కోరిన సీఎం
- అత్యవసర సేవలు తప్ప అన్నీ బంద్
షట్డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా ఆహార పొట్లాలు పంపిణీ చేయనున్నట్టు సీఎం తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం అర్హులందరికీ ఉచితంగా గోధుమలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రాజస్థాన్లో శనివారం కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల మొత్తం సంఖ్య 23కు పెరిగింది. కరోనా బాధితుల్లో నాలుగున్నరేళ్ల బాలిక ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.