1006 మంది అనుమానితులకు పరీక్షలు: ఏపీ ప్రభుత్వ అధికారిక బులెటిన్ విడుదల
- 135 మంది అనుమానితుల నమూనాలు ల్యాబ్కు
- 108 మందికి నెగెటివ్... ముగ్గురికి పాజిటివ్
- 24 మంది నమూనాల నివేదిక రావాల్సి ఉంది
ఇక, మిగిలిన అనుమానితుల్లో 28 రోజుల వైద్య పరీక్షల అనంతరం 259 మందిని ఇళ్లకు పంపించేశామని, మరో 711 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారని బులెటిన్లో వెల్లడించింది. మరో 36 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది.