Sensex: కరోనా భయాలను పక్కనపెట్టి దూసుకుపోయిన మార్కెట్లు

  • 1,628 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 482 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 18.58 శాతం పెరిగిన ఓఎన్జీసీ
Sensex and Nifty higher after four day selloff

కరోనా భయాలతో గత నాలుగు సెషన్లుగా భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం తాయిలాలను ప్రకటిస్తుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,628 పాయింట్లు లాభపడి 29,916కి ఎగబాకింది. నిఫ్టీ 482 పాయింట్లు పెరిగి 8,745కి చేరుకుంది. ఈ నాటి ట్రేడింగ్ లో అన్ని సూచీలు లాభపడ్డాయి. ఎనర్జీ షేర్లు 9 శాతం పైగా... చమురు, మెటల్, ఐటీ, టెక్ స్టాకులు 8 శాతానికి పైగా లాభపడ్డాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (18.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (13.01%), హిందుస్థాన్ యూనిలీవర్ (11.75%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (11.24%), టీసీఎస్ (9.90%).

సెన్సెక్స్ లో హెచ్డీఎఫ్సీ (-1.39%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.88%) మాత్రమే నష్టపోయాయి.

More Telugu News