ఇనార్బిట్ మాల్ ప్రాంతంలో.. మొక్కలు తొలగించినందుకు రూ. 50 వేల జరిమానా విధించిన ఆటవీశాఖ!
- ఇనార్బిట్ మాల్ నుంచి ఐకియా వరకు ఉన్న 60 మొక్కల తొలగింపు
- జరిమానా విధించిన అటవీ శాఖ
- మరో 180 మొక్కలు నాటాలని ఆదేశం
ఈ మొత్తం జరిమానాను సత్వా కాంప్లెక్స్కు సంబంధించిన అమిత్ బగ్లా అనే వ్యక్తి చెల్లించారు. అయితే, ఈ జరిమానా చాలా తక్కువ అని మొక్కలు తొలిగించిన విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన హరీష్ అనే సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. తొలగించిన మొక్కల సంఖ్య దాదాపు వందపైనే ఉంటుందని, ఆ స్థలంలో రోడ్డు కూడా వేశారని చెప్పారు. చిన్న మొత్తం జరిమానా విధిస్తే అభివృద్ధి పేరుతో ఇలాంటి పని చేసే ఇతరులను అడ్డుకోలేమన్నారు.