తిరుపతి ఎయిర్‌పోర్టులో కరోనా ముందస్తు తనిఖీల్లేవు

No sreaning tests in tirupathi airport
  • రోజుకి మూడు వేల మంది ప్రయాణికుల రాకపోకలు
  • స్వచ్ఛందంగా తనిఖీ చేసుకోవడమే తప్ప కట్టడి లేదు
  • డొమెస్టిక్‌ సర్వీసువల్లే అని చెబుతున్న అధికారులు
కరోనా ఎఫెక్ట్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు జరుగుతున్నా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. నిత్యం ఈ విమానాశ్రయానికి విశాఖ, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి విమానాల రాకపోకలు ఉంటాయి. కనీసం 2,700 నుంచి 3 వేల మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతారు.

అయితే వచ్చి వెళ్లిన వారిలో ఎవరైనా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడం తప్ప అధికారులు మాత్రం ఎటువంటి కట్టడి చేయడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే ఈ విమానాశ్రయానికి వచ్చే సర్వీసులన్నీ దేశీయ (డొమెస్టిక్‌)మైనవని, అందువల్లే చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. సిబ్బంది మాత్రం మాస్క్‌లు, గ్లౌజులు వినియోగిస్తున్నా ప్రయాణికుల పట్ల మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Go Back to Shorts
Chittoor District
Tirupathi airport
sceaning tests

More Telugu News