ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!
- యస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న అడాగ్ కంపెనీలు
- తిరిగి చెల్లించడంలో విఫలమైన సంస్థలు
- ముంబైలోని కార్యాలయంలో విచారణ
అయితే, ఈ కంపెనీలు సకాలంలో రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో, రుణాలన్నీ నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరిపోయాయి. ఈ విషయాన్ని నిర్ధారించిన ఈడీ, అనిల్ అంబానీకి సమన్లు పంపించింది. యస్ బ్యాంకులో జరిగిన అవకతవకల కేసులో యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన అధికారులు, ఆయన్ను విచారిస్తున్నారు. ఇచ్చిన అప్పులు వసూలు చేయడంలో నిర్లక్ష్యం చూపడం, నిరర్థక ఆస్తులు పెరిగిపోయిన కారణంతోనే బ్యాంకు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.