Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి డాక్టర్ల నిర్వాకం: 9 నెలల గర్భిణీకి చేయాల్సిన శస్త్రచికిత్సను 7 నెలల గర్భిణీకి చేశారు!

  • గాంధీలో డాక్టర్ల నిర్లక్ష్యం!
  • పొరబాటు సర్జరీ కారణంగా బిడ్డ మృతి
  • తల్లి పరిస్థితి విషమం

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అత్యంత బాధాకరమైన సంఘటన జరిగింది. డాక్టర్లు నిర్లక్ష్యంతో వ్యవహరించి ఓ శిశువు మృతికి కారణమయ్యారు. 9 నెలల గర్భిణీకి చేయాల్సిన శస్త్రచికిత్సను 7 నెలల గర్భిణీకి చేసి బిడ్డ మృతికి కారకులవడమే కాకుండా తల్లి ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెట్టారు. సమత అనే యువతి ప్రసవం కోసం మరో 2 నెలలు వేచి చూడాల్సి ఉండగా, పొరబాటున ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. దాంతో పూర్తిగా రూపం ఏర్పడని చిన్నారి కన్నుమూసింది. అధిక రక్తస్రావం కారణంగా సమత పరిస్థితి విషమించింది. దీనిపై సమత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News