పోలీసుల తీరును నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించిన కమలహాసన్
- ఇండియన్-2 సెట్స్ పై ప్రమాదంలో ముగ్గురి మృతి
- కమల్ కు నోటీసులు పంపిన సీబీసీఐడీ పోలీసులు
- పోలీసులు వేధిస్తున్నారంటూ కమల్ ఆరోపణ
పోలీసుల వైఖరిని నిరసిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమల్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కమల్, శంకర్ కాంబోలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రం చెన్నై శివార్లలో షూటింగ్ జరుపుకుంటుండగా, సెట్స్ పై భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్ బాయ్ మరణించారు. ఈ వ్యవహారంలో దర్శకుడు శంకర్ కు కూడా పోలీసులు నోటీసులు పంపారు.