Nirbhaya: నిర్భయ దోషుల మరో ప్రయత్నం.. ఈసారి ఐసీజేలో పిటిషన్​!

  • అంతర్జాతీయ న్యాయస్థానంలో ముగ్గురు దోషుల పిటిషన్
  • ఉరి శిక్షపై ‘స్టే’ విధించాలని కోరిన దోషులు
  • కొత్త డెత్ వారెంట్ ప్రకారం ఈ నెల 20న అమలు కానున్న శిక్ష
Nirbhaya convicts files a petetion in International court of Justice

నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు మరో కొత్త పన్నాగం పన్నారు. ఈ దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ను ఆశ్రయించారు. అక్షయ్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మలు తమకు విధించిన ఉరి శిక్షపై ‘స్టే’ విధించాలని కోరుతూ ఐసీజేలో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, నిర్భయ దోషులకు విధించిన ఉరి శిక్ష అమలు కాకుండా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టు ఇటీవల జారీ చేసిన కొత్త డెత్ వారెంట్ల ప్రకారం నలుగురు దోషులకు ఈ నెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఉరి శిక్ష విధించాల్సి ఉంది.

More Telugu News