బోండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడి కేసు నిందితుడు కిషోర్కు స్టేషన్ బెయిల్!
- కారులో వెళ్తున్న బుద్ధా, ఉమలపై కిషోర్ దాడి
- బెయిలు ఇచ్చినా ప్రతి రోజూ స్టేషన్లో హాజరు కావాల్సిందే
- కిషోర్ తరపున నామినేషన్ వేసిన మహంకాళి కన్నారావు
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కిషోర్ 13వ వార్డు నుంచి బరిలోకి దిగారు. మహంకాళి కన్నారావు అనే వ్యక్తి ఆయన తరపున నిన్న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పట్టణంలో మొత్తం 31 వార్డులు ఉండగా గత రెండు రోజుల్లో రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడం విశేషం. ఆ రెండూ వైసీపీవే కావడం గమనార్హం.