Private Bus: హైదరాబాదు శివారులో నడిరోడ్డుపై దగ్ధమైన బస్సు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

  • రామచంద్రాపురంలో ఘటన
  • భయంతో బస్సు దిగిన ప్రయాణికులు
  • ఆ వెంటనే మంటల్లో కాలిబూడిదైన బస్సు
Private Travel Bus Burned in Sangareddy dist

హైదరాబాదు శివారులో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నడిరోడ్డుపై దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిందీ ఘటన. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఆ వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు కిందికి దిగిన కాసేపటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News