Corona Virus: కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు మూసివేత
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసింది. ఢిల్లీ వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు మూసే ఉంచాలని, పరిస్థితిని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వార్షిక పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెకండరీ (11, 12 క్లాసులు) తరగతులకు మాత్రం బోధన కొనసాగించవచ్చని మినహాయింపు ఇచ్చారు.