subba ramireddy: జగన్‌తో సుబ్బరామిరెడ్డి కీలక భేటీ... రాజ్యసభ సీటుపై చర్చ!

  • సీఎం క్యాంపు ఆఫీసుకి సుబ్బరామిరెడ్డి
  • రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ఆసక్తి
  • వచ్చేనెలతో ముగియనున్న సుబ్బరామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం 
subba ramireddy meets jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి సీఎం క్యాంపు ఆఫీసుకి కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి వెళ్లారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తి రేపుతోంది. వచ్చేనెలతో సుబ్బరామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. దీనిపైనే ఆయన చర్చలు జరుపుతున్నారా? అన్న ఉత్కంఠ నెలకొంది.

కాగా, త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థులు ఎవరనే విషయంపై ఇప్పటికే జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిలను సీఎం జగన్‌ రాజ్యసభకు పంపనున్నట్లు సమాచారం. మరో సీటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి లేదా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ సత్వానీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 

More Telugu News