నిర్భయ దోషులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్మృతి ఇరానీ
- నాటకాలు ఆడుతున్నారంటూ వ్యాఖ్యలు
- వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారన్న కేంద్రమంత్రి
- విధివిధానాల్లో మార్పు జరగాలని ఆకాంక్ష
అన్ని ఆధారాలు నిర్భయ దోషులను వేలెత్తి చూపిస్తున్నా, శిక్ష అమలు విషయంలో వ్యవస్థలన్నీ అచేతనంగా మారిపోయినట్టు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను వారు అపహాస్యం చేస్తున్న తీరు పునరావృతం కాకూడదని భావిస్తున్నానని తెలిపారు. బ్యూరోఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (బీపీఆర్డీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ మహిళా సదస్సులో స్మృతి ఈ వ్యాఖ్యలు చేశారు.