ఆటోనగర్ కార్మికుల కోసం రూ.1.96 కోట్లు మంజూరు చేసిన కేశినేని నాని
- విజయవాడ ఆటోనగర్ లో వాటర్ ట్యాంకు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు
- చేయూతనివ్వాలని కోరిన ఆటోనగర్ ప్రతినిధులు
- ఎంపీ నిధుల నుంచి భారీ మొత్తం కేటాయించిన కేశినేని నాని
"రవాణా రంగానికి కేంద్రబిందువైన విజయవాడలో 1966లో ఆటోనగర్ ఏర్పడింది. ఇప్పుడది సుమారు లక్ష మందికి ఉపాధి కల్పిస్తోంది. అలాంటి ఆటోనగర్ లో 6 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, ఆర్వో ప్లాంట్ నిర్మాణానికి చేయూతనివ్వాలని ఆటోనగర్ యూనియన్ కార్యవర్గ సభ్యులు కోరారు. వారి అభ్యర్థనను మన్నించి ఎంపీ నిధుల నుంచి రూ.1.96 కోట్లు మంజూరు చేశాను" అంటూ వివరించారు.