Tenth exams: స్థానిక సంస్థల ఎన్నికల ఎఫెక్ట్‌: ఏపీలో టెన్త్‌ పరీక్షల తేదీల్లో మార్పులు

  • ఈ నెల 31వ తేదీ నుంచి మొదలు
  • 23వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలు ‌
  • 29వ తేదీ వరకు ఎన్నికలతో తాజా నిర్ణయం
AP ssc bord reshedule the tenth exams

అనుకున్నట్టే అయింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే పదో తరగతి పరీక్షలు వాయిదా పడతాయేమోనని భావించిన తల్లిదండ్రుల ఊహ నిజమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో ఈ నెల 23వ తేదీ నుంచి జరగాల్సిన టెన్త్‌ పరీక్షలు 31వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ మేరకు పరీక్షలను రీ షెడ్యూల్‌ చేశారు.

 మారిన తేదీల వివరాలు ఇలా వున్నాయి. మార్చి 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 1న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 3న సెకండ్‌ లాంగ్వేజ్ పేపర్‌, ఏప్రిల్‌ 4న ఇంగ్లీష్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 6న ఇంగ్లీష్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 7న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 8న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 9న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 11న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-2, ఏప్రిల్ 16న ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, ఏప్రిల్ 17న ఎస్‌ఎస్‌ఎస్సీ ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్షలు జరగనున్నాయి.

More Telugu News