తిరుమలకు వెల్లువలా భక్తులు... ఒక్కసారిగా పెరిగిన రద్దీ!
- వైభవంగా జరుగుతున్న తెప్పోత్సవాలు
- వారాంతం కలిసిరావడంతో పెరిగిన భక్తుల సంఖ్య
- నిన్న దర్శించుకున్న 68 వేల మంది
కాగా, తిరుమలలో వెంకన్న తెప్పోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలోనే భక్తుల సంఖ్య పెరిగిందని అధికారులు అంచనా వేశారు. క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు అన్న పానీయాలు నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ ఉదయం పుష్కరిణిలో స్వామివారు శ్రీ కృష్ణుని అవతారంలో విహరించనున్నారు. నిన్న స్వామివారిని సుమారు 68 వేల మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 2. 75 కోట్ల మేరకు ఆదాయం లభించింది.