విజయ్ దేవరకొండ జోడీగా ముందుగా దిశా పటానీని అనుకున్నారట
- సెట్స్ పై పూరి మార్క్ లవ్ స్టోరీ
- పూరి ఆఫర్ ను తిరస్కరించిన దిశా
- బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
దిశా పటానీని 'లోఫర్' చిత్రం ద్వారా వెండితెరకి పరిచయం చేసిందే పూరి. అందువలన ఆమె కాదనదనే ఉద్దేశంతో సంప్రదింపులు జరిపాడని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తాను చేయలేనంటూ దిశా కొన్ని కారణాలు చెప్పిందని అంటున్నారు. అప్పుడే అనన్య పాండేను తీసుకున్నారట. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నది త్వరలోనే చెబుతారట.