Subhash chandra Gorg: ఏపీ సీఎం జగన్​ ని కలిసిన సుభాష్​ చంద్రగార్గ్​

  • ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడిగా సుభాష్ చంద్ర గార్గ్
  • జగన్ కు కృతఙ్ఞతలు తెలిపిన వైనం
  • త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న గార్గ్

ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడిగా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ను నియమించారు. త్వరలో ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏపీ సీఎం జగన్ ని ఆయన కలిశారు. ఈ పదవిలో తనను నియమించడం పట్ల కృతఙ్ఞతలు తెలిపారు. దేశ, విదేశీ సంస్థల నుంచి ఏపీకి నిధుల సమీకరణపై గార్గ్ దృష్టి సారించనున్నట్టు సమాచారం.

More Telugu News