China: కరోనా బాధితుడికి ఊపిరితిత్తులు మార్చిన చైనా వైద్యులు

  • 59 ఏళ్ల వ్యక్తికి ఊరితిత్తుల మార్పిడి ఆపరేషన్
  • బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరణ
  • ఐదు గంటలపాటు శస్త్రచికిత్స
Worlds first COVID 19 patient gets lung transplant in China

కరోనా వైరస్ బారిన పడి ప్రాణాపాయంలో ఉన్న 59 ఏళ్ల వ్యక్తికి చైనా వైద్యులు ఊపిరితిత్తులు మార్పిడి ఆపరేషన్ చేశారు. జింగ్సు ప్రావిన్స్‌ వూక్సి నగరంలోని పీపుల్స్‌ ఆసుపత్రి వైద్యులు ఈ ఘనత సాధించారు. బాధితుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

జనవరి 26న అతడు కరోనా వైరస్ బారినపడినట్టు తేలింది. అయితే, ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఆ లక్షణాలు లేవని నిర్ధారణ అయింది. అయితే, అతడి శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతిన్నట్టు గుర్తించిన వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయిన మరో వ్యక్తి నుంచి ఊపిరితిత్తులు సేకరించి అతడికి అమర్చారు. ఐదు గంటలపాటు నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైనట్టు వైద్యులు తెలిపారు. కాగా, కరోనా బాధితుడికి ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి.

More Telugu News