Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

  • వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంటలో ఘటన
  • అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిన తుఫాన్ వాహనం
  • పలువురికి గాయాలు
Road Accident in Guntur District

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన వాహనం (తుఫాన్) వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతులు కాకాని గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

More Telugu News