Monkey Fever: కర్ణాటకలో ప్రబలుతున్న మంకీ ఫీవర్... ఇప్పటికే ఇద్దరు మృత్యువాత

Monkey Fever causes death of two in Karnataka
  • భారత్ లో ఉనికి చాటుకుంటున్న మరో మహమ్మారి
  • శివమొగ్గ ప్రాంతంలో 55 మందికి సోకినట్టు గుర్తింపు
  • కైసనూరు ఫారెస్ట్ డిసీజ్ కే మరో పేరు మంకీ ఫీవర్

కరోనా వైరస్ అనేక దేశాలను హడలెత్తిస్తున్న తరుణంలో భారత్ లో మరో ప్రమాదకర వైరస్ తన ఉనికి చాటుకుంటోంది. మంకీ ఫీవర్ వైరస్ గా పిలిచే ఈ మహమ్మారి కారణంగా కర్ణాటకలో ఇప్పటివరకు ఇద్దరు మరణించారు. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో 55 మంది మంకీ ఫీవర్ బారినపడినట్టు గుర్తించారు. వాస్తవానికి ఈ వ్యాధిని కైసనూరు ఫారెస్ట్ డిసీజ్ గా వ్యవహరిస్తారు. దీనికే మంకీ ఫీవర్ అని మరో పేరుంది. మంకీ ఫీవర్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ఆందోళన హెచ్చుతోంది. సిద్ధపుర తాలూకాకు చెందిన భాస్కర్ గణపతి హెగ్డే (64), మరో మహిళ మంకీ ఫీవర్ కారణంగా మరణించినట్టు అధికార వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News