Chiranjeevi: మహేశ్ బాబు .. 30 నిమిషాలు .. 30 కోట్లు!

  • షూటింగు దశలో చిరూ సినిమా 
  • ముఖ్యమైన పాత్రలో మహేశ్ బాబు 
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ    
Koratala Siva Movie

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. చిరంజీవి కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను మహేశ్ బాబు పోషించనున్నాడు. దాదాపు అరగంట నిడివి కలిగిన పాత్రలో మహేశ్ బాబు కనిపించనున్నాడు.

సాధారణంగా మహేశ్ బాబు ఈ తరహా పాత్రలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపడు. కానీ చిరంజీవితోను .. అటు కొరటాలతోను ఆయనకి మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన ఈ సినిమాలో చేయడానికి ఆయన అంగీకరించాడని చెప్పుకున్నారు. ఇక ఈ సినిమాలో చేయడానికిగాను పారితోషికంగా ఆయన 30 కోట్లను అందుకోనున్నాడనేది తాజా సమాచారం. ఇందులో వాస్తవమెంతోగానీ, ఇప్పుడు ఈ వార్తే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతుండగా, కథానాయికగా త్రిష పేరు వినిపిస్తోంది.

More Telugu News