Corona Virus: జపాన్, దక్షిణ కొరియా పౌరులకు భారత్ వీసాల జారీ నిలిపివేత

  • ఇతర దేశాలకు శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్
  • దక్షిణకొరియా, జపాన్ దేశాల్లో మోగుతున్న మృత్యు ఘంటికలు
  • మరింత అప్రమత్తమైన భారత్
India stops issuing visas to Japan and South Korea

చైనాకు ముచ్చెమటలు పట్టించిన కరోనా వైరస్ శర వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దక్షిణకొరియా, ఇరాన్, ఇటలీ దేశాలను వణికిస్తోంది. తాజాగా నిన్న పాకిస్థాన్ లో కూడా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, భారత్ మరింత అప్రమత్తమైంది. దక్షిణకొరియా, జపాన్ దేశాల్లో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తున్న క్రమంలో ఆ దేశాల పౌరులకు వీసాల జారీని ఆపేసింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మాట్లాడుతూ, ఆ దేశాల నుంచి భారత్ కు వచ్చే పౌరులకు తాత్కాలికంగా వీసాల జారీని నిలిపివేస్తున్నామని ప్రకటించింది.

  • Loading...

More Telugu News