Indian-2: చెన్నై పోలీసుల ఎదుట విచారణకు హాజరైన దర్శకుడు శంకర్!

  • 'భారతీయుడు-2' షూటింగ్ లో ప్రమాదం
  • చెన్నై కమిషనర్ కార్యాలయంలో శంకర్ హాజరు
  • వివరణ ఇచ్చిన దర్శకుడు
Police Enquiry on Director Shanker

తన దర్శకత్వంలో రూపొందుతున్న 'భారతీయుడు-2' షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదంపై వివరణ ఇచ్చేందుకు ప్రముఖ దర్శకుడు శంకర్, నిన్న చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసులో ఆయనకు నోటీసులు అందాయన్న సంగతి తెలిసిందే. ఆయన్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ నాగజ్యోతి విచారించారు. ప్రమాదం ఎలా జరిగింది? ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా? సినిమాకు బీమా ఉందా? వంటి ప్రశ్నలను ఆమె అడిగినట్టు సమాచారం. ఇక ఈ దుర్ఘటనపై నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్, క్రేన్ కాంట్రాక్టర్, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్ లపై కేసును రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ కేసులో కమల్ ను సైతం పోలీసులు ప్రశ్నించనున్నారు.

More Telugu News