Akhil: అఖిల్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ వచ్చేస్తోంది

  • అఖిల్ నుంచి మరో విభిన్న కథా చిత్రం 
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 
  • ఏప్రిల్ 14వ తేదీన భారీ విడుదల
Bommarillu Bhaskar Movie

అఖిల్ తాజా చిత్రంగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' రూపొందుతోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. 'మనసా .. మనసా' అంటూ ఆయన స్వరపరిచిన బాణీని సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ పాటను మార్చి 2వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇప్పటివరకూ సిద్ శ్రీరామ్ పాడిన చెప్పుకోదగిన పాటల్లో ఒకటిగా ఈ పాట మిగిలిపోతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకసారి వినగానే హృదయానికి హత్తుకుపోయేలా ఉంటుందనీ, సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మంత్రముగ్ధులను చేస్తాడని అంటున్నారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటివరకూ సరైన హిట్ ను కొట్టలేకపోయిన అఖిల్, ఈ సినిమాతోనైనా విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

More Telugu News