Khushbu: ఈ మనిషికి ఎవరైనా చెప్పండయ్యా!: కిషన్ రెడ్డిపై ఖుష్బూ వ్యాఖ్యలు

  • ఢిల్లీ అల్లర్ల కారకులు ఎవరో చెప్పాలని కాంగ్రెస్, రాహుల్ లను ప్రశ్నించిన కిషన్ రెడ్డి
  • కారకులెవరో అందరికీ తెలుసన్న ఖుష్బూ
  • అమిత్ షా, మోదీ తప్ప ఇంకెవరంటూ ట్వీట్
Khushbu fires on Kishan Reddy

సీఏఏ వ్యతిరేక నిరసనలు ఢిల్లీలో హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటనల వెనుక ఎవరున్నారో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ ట్విట్టర్ లో స్పందించారు. "దయచేసి ఎవరైనా ఈ మనిషికి చెప్పండి.... ఆ ఘటనల వెనుక ఉన్నది అమిత్ షా, నరేంద్ర మోదీ తప్ప ఇంకెవరు? ఈ విషయం అందరికీ తెలుసు" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News