Chandrababu: నేను అధికారంలో ఉంటే పెన్షన్లు పెరిగేవి: చంద్రబాబు

  • చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • వైసీపీకి ఓటేసినందుకు పొట్టకొడుతున్నారంటూ ఆగ్రహం
  • పేదవాడు బతికే వీల్లేకుండా కంపెనీలను తరిమేస్తున్నారని మండిపాటు
Chandrababu visits Kuppam constituency

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము తీసుకువచ్చిన ప్రజా సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. పేదవాడు బతకడానికి వీలు లేకుండా కంపెనీలను తరిమేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి ఓటేసినందుకు పొట్టకొడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలో ఉంటే పెన్షన్లు పెరిగేవని, అన్ని ప్రాంతాలకు నీళ్లు వచ్చేవని అన్నారు.

ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా ప్రాజెక్టును రూ.6 వేల కోట్లతో పనులు జరిపామని, ఆ ఘనత తనదేనని తెలిపారు. అయితే, కాల్వలన్నీ పూర్తి చేసినా, కాంట్రాక్టర్లు సరిగా పనిచేయలేదని ఆరోపించారు. మరో రూ.20 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా పూర్తయ్యేదని అన్నారు. 'నా మీద ఏదో తవ్వి చివరికి ఎలుక తోక కూడా పట్టుకోలేకపోయారు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ సిట్ వేశారు, ఏం తవ్వుతారో తవ్వుకోండి' అంటూ సవాల్ విసిరారు.

More Telugu News