70వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు

  • రాయపూడి నుంచి వెంకటపాలెం వరకు మానవహారం 
  • మందడం, తుళ్లూరులో  రైతుల ధర్నాలు 
  • వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు
ఏపీ రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు 70వ రోజుకు చేరాయి. రాయపూడి నుంచి వెంకటపాలెం వరకు మానవహారంగా ఏర్పడ్డారు. మరోవైపు మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, మందడం, తుళ్లూరులో ధర్నాలు చేపట్టారు. వెలగపూడిలో కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
Amaravati
Andhra Pradesh
Farmers
Agitation

More Telugu News