Chandrababu: కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు... పరిస్థితి ఉద్రిక్తం

  • చంద్రబాబు కుప్పం పర్యటన
  • నియోజకవర్గానికి బాబు చేసిందేమీ లేదని వైసీపీ కార్యకర్తల ఆగ్రహం
  • టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట
  • భారీగా మోహరించిన పోలీసులు
YSRCP members protests Chandrababu visit in Kuppam

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వెళ్లారు. అయితే ఆయనకు కుప్పంలో వ్యతిరేకత ఎదురైంది. వైసీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు భారీగా మోహరించారు.

More Telugu News