Uttar Pradesh: నోట్లో వేలు పెట్టి ఎంగిలితో పేజీలు తిప్పకండి: ఉద్యోగులకు ఉన్నతాధికారి ఆదేశాలు

up officer orders to government employees
షార్ట్స్‌లో చూడండి
పేజీలను తిప్పడానికి నోట్లో వేలిని పెట్టి తడి చేసుకుని తిప్పుతుంటారు చాలా మంది. అయితే, దీని వల్ల అంటు వ్యాధులు వచ్చే ప్రమాదముంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి అలవాటు ఉన్నవారు అధికమే. దీంతో ఓ ఉన్నతాధికారికి కోపం వచ్చింది. డాక్యుమెంట్లు, పేజీలను తిప్పటానికి ఎంగిలి ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
             
రాయబరేలీ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ అభిషేక్‌ గోయల్ ఇచ్చిన ఈ ఆదేశాలకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. ఎంగిలి వినియోగించి పేజీలను తిప్పే అలవాటు మానేస్తే అంటురోగాలను నివారించొచ్చనే ఉద్దేశంతోనే తాను ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వాటర్‌ స్పాంజ్‌లను మాత్రమే వాడాలని చెప్పారు.

Go Back to Shorts
Uttar Pradesh
offbeat

More Telugu News