Coronavirus: మరో నాలుగు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా కరోనా పరీక్షలు
- కరోనా వ్యాప్తిని నివారించేందుకు డీజీసీఏ చర్యలు
- ఇప్పటికే ఆరు దేశాల విమాన ప్రయాణికులకు పరీక్షలు
- ఆ జాబితాలోకి నేపాల్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా
దేశంలోకి కరోనా వైరస్ రాకుండా అడ్డుకునేందుకు మరో నాలుగు దేశాలకు చెందిన విమాన ప్రయాణికులకు పరీక్షలు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది. నేపాల్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది.