Narendra Modi: ట్రంప్‌ దంపతులతో కలసి తాజ్‌మహల్‌ సందర్శనకు మోదీ వెళ్లరట!

  • ఈ నెల 24న భారత పర్యటనకు ట్రంప్
  • అదే రోజు తాజ్‌మహల్‌ వద్దకు
  • వారితో పాటు మోదీ కూడా ఉంటారని వార్తలు
  • కొట్టి పారేసిన అధికారులు
Modi will not accompany the US President Donald Trump during his visit to Taj

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24న భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అదే రోజు తన భార్య మెలానియాతో ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. ఆ సమయంలో వారితో పాటు ప్రధాని మోదీ కూడా తాజ్‌ మహల్‌ను సందర్శిస్తారని వార్తలు వస్తున్నాయి.

దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తూ ఆ వార్తలను కొట్టేశారు. ఆ సమయంలో వారితో మోదీ ఉండబోరని స్పష్టం చేశారు. 'తాజ్‌మహల్‌ను ట్రంప్ సందర్శిస్తోన్న సమయంలో ఆయనతో పాటు మోదీ కూడా ఉంటారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారితో కలిసి భారత్ నుంచి ఏ ప్రముఖ వ్యక్తీ తాజ్‌మహల్‌ను సందర్శించరు' అని చెప్పారు.

More Telugu News