Sriramulu: కర్ణాటక మంత్రి శ్రీరాములు కుమార్తె పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని

  • మార్చి 5న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో రక్షిత–సంజీవ్ ల పెళ్లి
  • కొత్త జీవితం సుఖ సంతోషాలతో నిండాలి
  • నూతన భాగస్వామ్యంలో అద్భుతమైన అనుభవాలు పంచుకోవాలి
Prime Minister Modi Wishes karnatka minister daughter

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం హైదరాబాద్  కు చెందిన సంజీవ్ రెడ్డితో మార్చి 5న జరగనుంది. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరాములు ఆహ్వానించారు. దీనిపై సంతోషం వ్యక్తం  చేసిన మోదీ, వధూవరులను ఆశీర్వదిస్తూ ఓ లేఖను పంపారు. కొత్త జీవితం సుఖ సంతోషాలతో నిండాలని, నూతన భాగస్వామ్యంలో అద్భుతమైన అనుభవాలను పంచుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, మార్చి 5న బెంగళూరు ప్యాలెస్ మైదానం వేదికగా రక్షిత, సంజీవ్ ల వివాహం జరగనుంది. ఇటీవలే వారి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News