Rashmi Gautam: 100 ఎకరాల భూమిని కొన్న యాంకర్ రష్మీ?

  • ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో భూమి కొనుగోలు
  • రూ. 5 కోట్లతో డీల్ 
  • యూకలిప్టస్, కోకా చెట్లను పెంచాలనుకుంటున్న రష్మీ
Rashmi Purchases 100 acres land

బుల్లి తెరపై సందడి చేస్తూనే... అడపాదడపా సినిమాల్లో నటిస్తూ యాంకర్ రష్మీ చాలా బిజీగానే ఉంటోంది. తాజాగా రష్మీకి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. వంద ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె కొనుగోలు చేసిందనేదే ఆ వార్త. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో తన సొంత ఊరైన బరంపురం ప్రాంతంలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. దీని కోసం దాదాపు రూ. 5 కోట్లతో డీల్ జరిగినట్టు సమాచారం. ఈ భూమిలో యూకలిప్టస్, కోకా చెట్లను పెంచాలని ఆమె భావిస్తోందట.  

More Telugu News