ఆల్ టైమ్ రికార్డును దాటేసిన బంగారం ధర!
- కరోనా భయాలతో స్టాక్ మార్కెట్ డీలా
- బులియన్ మార్కెట్ వైపు ఇన్వెస్టర్ల పరుగులు
- కొన్ని చోట్ల రూ. 43 వేలు దాటిన ధర
ప్రస్తుతం భారత్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 42,462కు (న్యూఢిల్లీ) చేరింది. మంగళవారం నాటితో పోలిస్తే, బుధవారం ఒక్కరోజే ధర రూ. 468 పెరిగింది. వెండి ధర కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. 48,652కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో బంగారం ధర రూ. 43 వేలను కూడా దాటేసి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పడం గమనార్హం.